గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది.. దుబ్బాక ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

cm kcr comments on dubbak bypoll

దుబ్బాక ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. ఈసందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

cm kcr comments on dubbak bypoll
cm kcr comments on dubbak bypoll

మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ దుబ్బాక ఉపఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి పెద్ద లెక్క కాదన్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో దుబ్బాకలో గెలవబోతున్నామని సంకేతం చూపించారు.

ఎన్నికలన్నప్పుడు చిల్లర తతంగాలు కామన్. అవన్నీ పట్టించుకోము. గ్రౌండ్ చాలా క్లియర్ గా ఉంది. గెలుపు ఎప్పుడో ఖాయం అయిపోయింది.. అని సీఎం వెల్లడించారు.

గత కొన్ని రోజుల నుంచి దుబ్బాకలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ అభ్యర్థిపై కావాలని కుట్ర పన్నుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు దాడి చేశారని.. పోలీసులే కావాలని రఘునందన్ రావు బంధువు ఇంట్లో డబ్బులు పెట్టి.. కావాలని నాటకాలాడుతోందని ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత సంతరించుకుంది.