Harish Rao: అది నిజమైతే పదవికి రాజీనామా.. అసలు విషయంలో కుండబద్దలు కొట్టిన హరీశ్ రావ్

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీపై జరుగుతున్న విలీనం ప్రచారాలను ఖండిస్తూ, ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. “బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది, మళ్లీ అధికారంలోకి వస్తుంది” అని ఆయన ధీమాగా తెలిపారు. ఈ ప్రకటనతో బీఆర్‌ఎస్ స్ట్రాటజీపై స్పష్టత వచ్చినట్లు అయింది.

ఇక సీఎంగా రేవంత్ రెడ్డి పని తీరుపై హరీశ్ తీవ్ర విమర్శలు చేశారు. “ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక్క చెరువు అయినా తవ్వారా?” అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను కాపాడలేకపోయారని, రైతుబంధు, రైతు బీమా పథకాల అమలులో విఫలమయ్యారని ఆరోపించారు. అంతేగాక రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని తిప్పిపోశారు.

మహిళల పథకాల విషయంలో కూడా హరీశ్ తీవ్రంగా స్పందించారు. “రూ.21 కోట్ల వడ్డీ రహిత రుణాలిచ్చామంటున్నారు. నిజమే అయితే నేను పదవి నుంచి తప్పుకుంటాను” అంటూ సీఎం చేసిన ప్రకటనకు సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

ఇక రాష్ట్ర పరిరక్షణ కోణంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ప్రశ్నిస్తూ, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. “రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే ఏ చర్యనైనా ఊరుకోము. అవసరమైనప్పుడు అధికారులను కూడా ప్రశ్నించడానికి సిద్ధమే” అని హెచ్చరించారు. రెడ్‌బుక్ వ్యాఖ్యలతో అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన అప్రమత్తం చేశారు. ఇటీవలి అందాల పోటీపై కూడా హరీశ్ స్పందించారు. మిస్ ఇంగ్లండ్ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిన్నదని మండిపడ్డారు. “సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టి నిజాలను ప్రజలకు తెలియజేయాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ వైఖరిని మరింత రూఢిగా స్పష్టం చేస్తున్నాయి.

ఏరా ఆలీగా లంకొడుకు || Rajendra Prasad Controversial Comments On Comedian Ali || Roja || TeluguRajyam