ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసి జెండావిష్కరణపై వివాదం (వీడియో)

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఆయన ఘనతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండావందనం అనంతరం జాతీయ గీతం జనగనమన ఆలపించారు. 

సాధారణంగా జాతీయగీతం ఆలపించే సమయంలో జాతీయ జెండాకు శెల్యూట్ చేస్తూ నిలబడతారు. కానీ అసదుద్దీన్ ఓవైసి మాత్రం సాదా సీదాగా నిలబడి జాతీయ గీతం ఆలపించి జాతీయ జెండాకు సెల్యూట్ చేయకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. 

అసదుద్దీన్ ఓవైసి జాతీయ జెండా ఆవిష్కరించిన వీడియో కింద ఉంది చూడొచ్చు.