అంటే.. చంద్రబాబే లోకేష్‌ను జైల్లో వేయించాలనా మీరనేది !?

YSRCP supporters cracking jokes on Chandrababu Naidu, Lokesh

వైసీపీ నేతలు లోకేష్ విషయంలో ఎప్పుడూ కామెడీ చేస్తూనే ఉంటారు.  లోకేష్ మీద వారు సీరియస్ గా మాట్లాడినా అది ఒక్కోసారి జనంలోకి పిచ్చ కామెడీగా వెళుతుంటుంది.  అది కూడ వైసీపీ శ్రేణుల్లోకే కావడం విశేషం.  చంద్రబాబు నాయుడును దుయ్యబట్టడంలో ఎప్పుడూ ముందుండే వైసీపీ నేత ఎమ్మెల్యే రోజా.  జగన్ సహా వైసీపీ లీడర్లు అందరూ చంద్రబాబును విమర్శించే తీరు ఒకలా ఉంటే రోజా విమర్శించే తీరు ఇంకోలా ఉంటుంది.  ఆయనకు పూటకొక పేరు పెట్టమన్నా పెట్టగలరు రోజా.  ఆమె విసిరే సవాళ్లలో వేటికీ బాబుగారు లేదా టీడీపీ నేతల దగ్గర సమాధానమే ఉండదు.  అసలు ఈమధ్య రోజాగారి పేరు ప్రస్తావించడమే మానేశారు. 

YSRCP supporters cracking jokes on Chandrababu Naidu, Lokesh
YSRCP supporters cracking jokes on Chandrababu Naidu, Lokesh

తాజాగా రోజా అమరావతి భూముల కుంభకోణం గురించి మాట్లాడుతూ బాబు మీద విరుచుకుపడ్డారు.  అమరావతి భూముల్లో ముమ్మాటికీ కుంభకోణం జరిగిందన్న ఆమె వేల ఎకరాల్లో చంద్రబాబు, ఆయన బినామీలు కలిసి ఇన్ సైడ్ ట్రేడింగ్ నడిపారని మండిపడుతూ ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశించిందని కానీ ఆ విచారణ మీద కోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని కుంభకోణంలో ఆరోపణలున్న ఓ లాయర్ మీద కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం బాధాకరమని రోజా అన్నారు. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ఏసీబీ విచారణ అంటే బాబు అండ్ గ్యాంగ్ వణుకుతున్నారని అన్నారు. 

YSRCP supporters cracking jokes on Chandrababu Naidu, Lokesh
YSRCP supporters cracking jokes on Chandrababu Naidu, Lokesh

తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఏ తప్పూ చేయకపోయినా అంతర్వేది ఘటన మీద సీఎం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారని, అలాంటి నిజాయితీ ఉంటే బాబు కూడ అమరావతి భూముల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు కొరగలరా అంటూ ఏపీ ఫైబట్ గ్రిడ్ అక్రమాలపై సీబీఐ విచారణ కోరతారా అంటూ సవాల్ విసిరారు.  ఈ చివరి సవాల్ చాలామందిచేత బాబు మీద సెటైర్లు వేసేలా చేసింది.  ఫైబర్ గ్రిడ్ అక్రమాలపై ప్రధాన ఆరోపణలు నారా లోకేష్ మీదున్నాయి.  ఆ తీగ లాగితే లోకేష్ డొంక కదులుతుందని చాలామంది అంటుంటారు.  వారంతా ఇప్పుడు రోజాగారి మాటలు విని ఏంటి మేడమ్ మీరనేది.. బాబుగారే సీబీఐని రప్పించి ఆయన చేతులతో ఆయనే లోకేష్‌ను లోపల వేయించాలనా మీరనేది.  చాలు ఊరుకోండి అంటూ చంద్రబాబు, లోకేష్ మీద జోకులు పెల్చుతున్నారు.