Anna Canteen: అన్న క్యాంటీన్లకు సర్టిఫికెట్ ఇచ్చిన వైసీపీ….సేవలు భేష్ అంటూ!

Anna Canteen: సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మొదట్లో చాలా ఉత్సాహంగా కనబడుతారు. రాను రాను ఆ పనిలో నాణ్యత లోపించడంతోపాటు పనిపై కూడా శ్రద్ధ వహించరు. ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల పనితీరు మాత్రం ఇప్పటికీ అద్భుతంగా ఉంది అంటూ అన్న క్యాంటీన్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక అన్న క్యాంటీన్లపై ప్రశంసలు కురిపించింది ఏ కూటమి పార్టీ నేతలో కాదండోయ్ స్వయంగా వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్వయంగా అన్న క్యాంటీన్ల తీరుపై ప్రశంసలు కురిపించారు. అన్న క్యాంటీన్ 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు ఈ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు.

ఈ ఆహార తయారీలో ఎలాంటి నాణ్యత కోల్పోకుండా మంచి నాణ్యతతో, రుచికరమైన పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారాన్ని అందజేస్తూ వచ్చారు. కానీ 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు కనుమరుగు అయ్యాయి. ఇక 2024లో తిరిగి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో తిరిగి పున ప్రారంభించారు.

ఇలా అన్న క్యాంటీన్లో తిరిగి ప్రారంభించిన రోజు ఎలాంటి పరిశుభ్రత ఆహారంలో నాణ్యత ఉందో ఇప్పటికీ కూడా అదే పరిశుభ్రతను నాణ్యతను కొనసాగిస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఇలా ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ కి వెళ్లి 5 రూపాయలు ఇచ్చి మరి అక్కడ టిఫిన్ చేసి అన్న క్యాంటీన్లపై ప్రశంసలకు కురిపిస్తూ వచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కూడా ఓ అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. లైనులో నిలబడి రూ.5 చెల్లించి టోకెన్‌ కొని, అల్పాహారాన్ని రుచి చూశారు. ఆహార పట్టిక, టోకెన్‌ కౌంటర్‌, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న శైలి, డైనింగ్‌ ఏరియాతోపాటు మంచినీరు, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాలను పరిశీలించి అన్న క్యాంటీన్లపై అక్కడ పరిశుభ్రతపై ప్రశంసలు కురిపించడం విశేషం.