సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన వైయస్ షర్మిల..

తాజాగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేశారు. తాజాగా ఆమె రైతుల సమస్యలపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రుణమాఫీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి మనకొద్దు అని ప్లకార్డు పట్టుకుని కేసీఆర్ పై విమర్శలు చేశారు.

70 ఏళ్లుగా కాస్తులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వడం లేదని.. ఎన్నికలకు ముందు పట్టాలు ఇస్తామని చెప్పిన ఆయన.. మళ్లీ ఇటు వైపు కూడా చూడలేదని అన్నారు. అంతేకాకుండా ఉన్న భూములు కూడా బలవంతంగా లాక్కుంటున్నారు అని అన్నారు. బంగారు తెలంగాణ అని రైతుకు బతుకే లేకుండా చేశారు అని షర్మిల బాగా విమర్శలు చేశారు.