ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అంటూ కేసీఆర్ పై విమర్శలు చేసిన వైఎస్ షర్మిల..

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ కు పదవి ఇస్తే.. ఎనిమిదేళ్ల నుండి ఆయన ఆడింది ఆట, పాడింది పాటలా కొనసాగుతుంది అని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం ప్రశ్నించకుండా మొద్దు నిద్రపోతుంది అని అన్నారు.

ఇక తాను ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీని స్థాపించానని అన్నారు. ఇక తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని.. తాను అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తానని అన్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తానని.. పోడు భూములకు పట్టాలు ఇస్తానని అన్నారు. ఇక కేసీఆర్ కు మరో సారి అధికారం ఇస్తే మాత్రం సర్వనాశనం అని అన్నారు.