రోజా కి ఊహించని షాక్ ఇచ్చిన జగన్ ? ఈ ఐడియా వెనక ఎవరు ఉన్నారు ?

వైసీపీలో నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు ఉన్న స్థానం గురించి అందరికి తెలుసు. ఆమెకు ఉన్న నోటి దురుసు వల్ల పార్టీ కావాల్సినంత పబ్లిసిటీని గతంలో రోజా తెచ్చారు. అలాగే తన మాటలు, ప్రవర్తన వల్ల వైసీపీకి కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చారు. రోజాపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా మంచి అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజాకు షాక్ ఇచ్చారని, దీనిపై ఆమె గుర్రుగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Roja
Roja

జగన్ రోజాకు ఇచ్చిన షాక్ ఏంటి?

జగన్ అంటే ఎంతో ఇష్టం ఉన్న రోజా ఇప్పుడు ఆయనపై కోపంతో ఉండటానికి బీసీ కార్పొరేషన్ పదవులు కారణమని తెలుస్తుంది. ఆర్కే రోజాకు స్థానిక వైసీపీ నేత కేజే కుమార్ కు మధ్య పొసగడం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో కేజే కుమార్ కార్యక్రమానికి వైసీపీ నేతలు ఎవరూ హాజరుకావద్దని ఆర్కే రోజా ఒక ఆడియో టేపును కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కేజే కుమార్ భార్య కేజే శాంతికి బీసీ కార్పొరేషన్లలో ఛైర్మన్ పదవి దక్కిందని ప్రచారం జరుగుతుంది. కేజే శాంతికి ఈడిగ కొర్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించినట్లు ఆమెకు సమాచారం అందిందని చెబుతున్నారు. దీంతో రోజా ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కడంతో ఆమె అనుచరుల్లోనూ అసహనం వ్యక్తమవుతుంది. నిజానికి బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉన్నా వాయిదా పడింది.

రోజాపై కుట్ర జరుగుతుందా!

కేజే కుమార్ సతీమణి శాాంతికి ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కడం వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ఆర్కే రోజా అనుమానిస్తున్నారు. గతంలోనూ మరో మంత్రి నారాయణస్వామి తన నియోజకవర్గంలో చెప్పకుండా పర్యటించిన విషయంపైనా ఆమె అసహనంతో ఉన్నారు. తాజాగా జగన్ నిర్ణయంతో ఆర్కే రోజా మరింత అసంతృప్తికి గురవుతున్నారని తెలిసింది. జగన్ పై రోజాకు ఏర్పడిన అసంతృప్తి ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.