Crime News: అమ్మాయి ప్రేమను అంగీకరించలేదని రైలు కింద పడి యువకుడు అత్మహత్య..!

Crime News: ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ప్రేమ కోసం చాలామంది తల్లి తండ్రులను కూడా ఎదురించి ఇంటి నుండి పారిపోయి మరి వివాహాలు చేసుకుంటున్నారు. మరి కొంత మంది అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకుని మోసం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల చేతుల్లో మోసపోతున్నారు. ప్రేమ పేరుతో చాలా మంది హత్యలకు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ప్రేమించిన వారు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో వారిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇటువంటి విషాదకర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను అంగీకరించలేదని యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూరు గ్రామంలో నివాసం ఉండే వడ్డె రాములు, సాయమ్మ దంపతుల మూడవ కుమారుడు మహేష్ అతని తమ్ముడు హరికృష్ణ తో కలిసి సొంత ఊరిలో నివాసం ఉంటున్నారు. మహేష్ వృత్తి రీత్యా మెకానిక్. ఈ క్రమంలో మహేష్ హైదరాబాదులో కొంత కాలం ఉన్నాడు. ఆ సమయంలో మహేష్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతో మహేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ బాధ తో మహేష్ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.

తాజాగా ఆదివారం రాత్రి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి ఆత్మహత్యాయత్నం చేయగా అతని తమ్ముడు దానిని గమనించి మహేష్ని అడ్డుకున్నాడు. మరి సోమవారం ఉదయం మహేష్ ఇంటి నుంచి బయలుదేరి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ముత్యాలంపల్లి శివారులోని రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు . అదే సమయంలో ఆ మార్గం గుండా వస్తున్న యశ్వంత్‌పూర్‌ నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న సంపర్గ్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .