సైకిల్ పై గస్తీ నిర్వహించిన మహిళా ఐపీఎస్.. వైరల్ వీడియో!

గ్రేటర్ చెన్నై ఉత్తర మండల డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా ప్రస్తుతం విధుల్లో ఉన్న మహిళా ఐపీఎస్ అధికారి రమ్య భారతి తాజాగా సైకిల్ పై గస్తీ నిర్వహించింది. నగరంలో రాత్రి వేళ ఏం జరుగుతుందన్న విషయం గురించి తెలుసుకోవటానికి ఆమె తాజాగా సైకిల్ పై పర్యటించింది.

గురువారం రాత్రి చెన్నైలో ఫ్లవర్ బజార్ నుంచి చాకలి పేట వరకు తనకు అనుమానం గా కనిపించిన వారిని విచారించింది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయం ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరికి చేరటంతో ఆయన ఆమెకున్న విధుల పట్ల గౌరవాన్ని అభినందించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమెకు సెల్యూట్ కొడుతున్నారు.