భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి.. ఏం జరిగిందంటే?

నేటి సమాజంలో వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు అనవసరంగా తమ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. లేని పోని ఆకర్షణలకు గురై.. జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. భర్తతో కాపురం చేయాల్సిన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం.. తాళి కట్టిన భార్య తో కలకాలం తోడునీడగా ఉండాల్సిన భర్త వేరొక మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

వివాహేతర సంబంధాల వల్ల కొన్ని కుటుంబాలు అయితే వీధిన పడుతున్నాయి. కొందరు అయితే ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి భర్త భార్య ని చంపడం, భార్య భర్త ని చంపడం ఒకరినొకరు చంపుకోడానికి కూడా వెనకాడటం లేదు. అయితే తాజాగా అక్రమ సంబంధాలకు మరొక వివాహిత బలి అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా లో మండలంలోని చంద్రపంచ లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రపంచ గ్రామానికి చెందిన బోడ తాయప్ప, అతని భార్య గోపమ్మ ఇంట్లో తరచూ గొడవలు పడే వారు. తాయప్ప వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లిపోయే వాడు.

దీనితో గోపమ్మ తన పిల్లలతో కలసి అత్తమామల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ నెల 27న రాత్రి ఆ వివాహిత పురుగుల మందు తాగింది. ఇక ఇదే విషయాన్ని అత్తమామలు ఆ వివహిత తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. ఇక అదే రాత్రి గోపమ్మ పరిస్థితి విషమించి చనిపోయినట్లు మరొకసారి అత్తమామలు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం పట్ల గోపమ్మ తల్లిదండ్రులు భర్త అతని కుటుంబ సభ్యుల బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశారనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై పోలీసులు ఆ వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.