సీతారామం విజయంతో మరో జన్మ ఎత్తినట్టుంది: అశ్వినీ దత్

ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మాణంలో ఆయన కుమార్తె స్వప్న సంయుక్తంగా శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా విజయం పట్ల నిర్మాత అశ్వినీ దత్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. సీతారామం వంటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తనకు నిర్మాతగా మరొక జన్మ ఎత్తినట్టు ఉందని ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈయన పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి విజయం అందుకుందని ఈయన తెలిపారు. ఇక ఈ సినిమాని గత రెండు సంవత్సరాల నుంచి ఆయన కుమార్తె స్వప్న ఒంటి చేత్తో ముందుకు నడిపించిందని అందుకు తన కుమార్తెకు కూడా అభినందనలు తెలియజేశారు.మొత్తానికి ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.