Crime News: కూల్ డ్రింక్ లో విషం కలిపి భర్త హత్యకు కుట్ర చేసిన భార్య..!

Crime News: సాధారణంగా బట్టల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవ పడుతూ ఉంటారు. గొడవలు మరింత ఎక్కువ అయితే భార్యలు అలిగి పుట్టింటికి వెళ్తుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది మహిళలు భార్య భర్తల గొడవల కారణంగా మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు మాత్రం భర్తలను హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే….ఇస్సపాలెం పరిధిలోని సాయి హోమ్స్‌లో అంబటిపూడి సాయిచరణ్, కోమలి దంపతులు నివాసం ఉంటున్నారు . గత కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండటంతో సాయి చరణ్ తన స్వగ్రామమైన కర్నూలు లో ఉంటున్నాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రకాష్ నగర్ కు చెందిన ఉమామహేశ్వరి అనే మహిళ సాయిచరణ్ కు కబురు పెట్టింది.

ఈ క్రమంలో కుటుంబంతో కలిసి ఫిబ్రవరి 28వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి సాయికిరణ్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో సాయి చరణ్ భార్య తన భర్తకు కూల్డ్రింక్లో విషం కలిపి ఇవ్వటంతో అది తాగిన సాయిచరణ్ కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు కి తరలించి చికిత్స చేస్తున్న తరుణంలో సాయి కిరణ్ జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు రావాలని ప్రకాష్‌ నగర్‌కు చెందిన ఉమామహేశ్వరి కబురు పెట్టింది. దీంతో సాయిచరణ్, కుటుంబ సభ్యులతో కలసి ఫిబ్రవరి 28వ తేదీ ఆమె ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య కోమలి విషం కలిపిన మజా కూల్‌డ్రింక్‌ ఇవ్వటంతో తాగాడు. కొద్ది సేపటి తరువాత సాయిచరణ్‌ అనారోగ్యానికి గురి అయి వాంతులు చేసుకున్నాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చేర్పించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య కోమలి, ఆమె కుటుంబ సభ్యులు, మధ్యవర్తి ఉమా మహేశ్వరి మీద కేసు నమోదు చేసుకున్నారు.