Wife And Husband: ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించింది… కానీ చివరకు ఇలా చేసి జైలుపాలైన మహిళ!

Wife And Husband: వివాహం తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి ఎన్నో కష్టాలను నష్టాలను భరిస్తూ సహనంతో ఉంటారు. పెళ్లి కాకముందు వరకు ఎంతో గారాబంగా పెరిగిన అమ్మాయి పెళ్లయిన తర్వాత అన్ని బాధ్యతలను తన భుజాలపై వేసుకొని కుటుంబాన్ని సక్రమంగా నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ కొంతమంది భర్తలు మాత్రం విచక్షణ రహితంగా భార్యలపై దాడి చేస్తూ ఉంటారు. ఇలా తరచు వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నా కుటుంబం కోసం భార్య వాటిని భరిస్తుంది. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా,గిద్దలూరుకి చెందిన అంకాళమ్మ, చిరంజీవి దంపతులు వీరికి ముగ్గురు సంతానం కాగా వీరిద్దరూ రోజు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రతిరోజు వచ్చి అంకాలమ్మ ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవాడు. అయితే తన భర్త పెట్టే చిత్రహింసల గురించి ఎప్పుడు ఎవరికీ చెప్పకుండా భరిస్తూ వచ్చిన ఆ భార్య చివరికి తన భర్త వేధింపులు తట్టుకోలేక ఈ విషయాన్ని నలుగురి ముందు ఉంచింది. దీంతో పెద్దలు అతనిని మందలించారు.

అయితే పెద్దలు బుద్ధి చెప్పడంతో మారుతాడని భావించిన చిరంజీవి మరింత ఎక్కువగా తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం బాగా తాగి వచ్చి తన భార్యతో గొడవ పడటమే కాకుండా తనపై విచక్షణారహితంగా దాడి చేయడంతో సహనం కోల్పోయిన భార్య రోకలిబండతో తన తలపై కొట్టింది. దీంతో అక్కడికక్కడే చిరంజీవి మృతి చెందడంతో స్వయంగా అంకాలమ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు దర్యాప్తు చేసుకొని విచారణ జరుపుతున్నారు.