వామ్మో.. ఈ మహిళ మామూలుది కాదు.. పెళ్లైన మూడు నెలలకే భర్తకు షాక్ ఇచ్చిన భార్య!

ప్రస్తుత కాలంలో ఏ చిన్న పని చేయాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పని చేస్తారు. ఇక కొన్ని సంవత్సరాల పాటు కలిసిమెలిసి ఉండే వివాహం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గత కొంతకాలం వరకు అబ్బాయిలు పెద్దఎత్తున అమ్మాయిలను మోసం చేస్తూ వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో అబ్బాయిలను మోసం చేయడంలో అమ్మాయిలు కూడా తక్కువేం కాదని తెలుస్తోంది. అందుకు ఉదాహరణ తాజాగా చెన్నైలో జరిగిన ఈ ఘటన అని చెప్పవచ్చు.

కోయంబత్తూరు సమీపంలోని కనువాయికి చెందిన విఘ్నేష్ అనే యువకుడికి గత మూడు నెలల క్రితం యామిని అనే యువతితో వివాహం జరిగింది. ఇలా మూడు నెలలపాటు ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఊహించని విధంగా ఆ యువతి విగ్నేష్ కి షాక్ ఇచ్చింది. పెళ్లయిన మూడునెలల తర్వాత తన భార్య ఇంట్లో కనిపించకపోవడంతో అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. అయితే ఇంట్లో డబ్బు నగదు బట్టలు కూడా లేకపోవటంతో తన భార్య తనని మోసం చేసిందని భావించి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడటంతో ఒక్కసారిగా విగ్నేష్ ఎంతో షాక్ అయ్యారు.

తనని పెళ్లి చేసుకున్న అమ్మాయి యామినికి ఇదివరకే పెళ్లి జరిగిందని,అయితే కొంతకాలం నుంచి తన భర్త శివకుమార్ కనిపించకపోవడంతో యామిని తనని రెండవ పెళ్లి చేసుకుందని ప్రస్తుతం తన మొదటి భర్త శివకుమార్ రావడంతో యామిని తనని వదిలి డబ్బు నగదు తీసుకుని తన మొదటి భర్త దగ్గరకు వెళ్ళిందని తెలియడంతో ఈయన షాక్ అయ్యాడు. ఇలా తనని పెళ్లి చేసుకుని దారుణంగా మోసం చేసినందుకు ఆ యువతి యామిని ఆమె తల్లిదండ్రుల పై ఫిర్యాదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని విగ్నేష్ పోలీసులను కోరారు. ఈ క్రమంలోనే ఈ విషయం అందరికీ తెలియడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.