Nagarjuna: నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇలా ఈ కార్యక్రమానికి ఎంతో మంది హీరోలు డైరెక్టర్లు వచ్చి తమదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున దూరంగా ఉన్నారు. ఇలా నాగార్జున ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…అసలు ఈ కార్యక్రమ నిర్వాహకులు నాగార్జునను ఈ కార్యక్రమం కోసం సంప్రదించలేదని వార్తలు వినపడుతున్నాయి. అసలు ఎంతో క్రేజ్ ఉన్న నాగార్జున ఈ కార్యక్రమానికి ఆహ్వానించక పోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఈ కార్యక్రమ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కినేని నాగార్జున బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బిజీగా ఉండటం వల్ల తమ షోకి రారని భావించిన నిర్వాహకులు ఈ టాక్ షో కోసం నాగార్జునను సంప్రదించలేదని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 4వ తేదీ ఈ కార్యక్రమం మొదటి సీజన్ పూర్తి అవుతుంది అలాగే ఈ ఏడాది చివరిలో రెండవ సీజన్ ప్రారంభమవుతుంది. బహుశా ఈ సీజన్లో నాగార్జున పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
