ఆ కార్ల యజమానులు ఎవరు.. ప్రభుత్వ వాహనం అని ఎందుకు తొలగించారు: రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఘటన గురించి మరోసారి స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలు వేశారు. జూబ్లీహిల్స్ లైంగిక ఘటనలో విచారణ జరగాలి అని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలని అన్నారు. సి వి ఆనంద్ కొన్ని విషయాలను బయట పెట్టలేదు అంటూ.. ఆ బెంజ్ కార్, ఇన్నోవా కారు ఓనర్ లు ఎవరు అని వాటిపై ప్రభుత్వ వాహనం ఉన్న స్టిక్కర్లను తొలగించింది ఎవరు అని ప్రశ్నించారు.

ఈ ఘటనలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అనేది ఆనంద్ చెప్పడం లేదు అంటూ.. ఆవాహన ఓనర్ లను పిలిచి ఎందుకు విచారించడం లేదు అని.. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత అంటూ.. మరి వారి వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.