Accident: కన్న వారిని చూసేందుకు బయలుదేరి కానరాని లోకాలకు వెళ్లిన యువతి..!

Accident: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది ఉంది వాహనదారులు వాహనాన్ని నడిపే సమయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది ప్రాణాలతో బయటపడిన తీవ్ర గాయాల వల్ల జీవితాంతం అంగ వైకల్యం అనుభవించాల్సిన పరిస్థితి. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. మైనర్లు వాహనాలను నడపటం వల్ల కూడా ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం వల్ల ఒక కుటుంబం మొత్తం మరణించింది.

వివరాలలోకి వెళితే.. కన్న వారిని చూడటం కోసం ఎంతో సంతోషంగా భర్త కొడుకుతో కలిసి బయలుదేరిన కూతురు వారిని చూడకుండానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది.హోసపేటెకు చెందిన మహమ్మద్‌గౌస్‌ కదిరికి చెందిన అమ్మాజాన్‌ ను వివాహం చేసుకున్నాడు. జీవనోపాధి కోసం కొంత కాలం అనంతపురం జిల్లా కదిరి లో ఉంటూ ద్విచక్ర వాహనాల క్రయ విక్రయాలు చేసేవాడు.మహమ్మద్‌గౌస్‌కు బెంగళూరులో మంచి పరిచయాలు ఉండటంతో వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందవచ్చన్న ఆశతో మూడు నెలల క్రితం బెంగళూరుకు కాపురం మార్చాడు.

ఐతే ఇటీవల మహమ్మద్ గౌస్ భార్య తన తల్లి, తండ్రి, సోదరుడిని చూడాలని కోరగా.. సోమవారం ఉదయం ద్విచక్ర వాహనం మీద ఇద్దరు వారి కుమారుడితో కలిసి సంతోషంగా బయలుదేరారు. ఈ క్రమంలో చిక్ బాలాపూర్ సమీపంలో హౌన్నేనహళ్లి క్రాస్ వద్ద ఓ ప్రైవేటు వాహనం వీరు వెళ్తున్న వాహనాన్ని డీ కొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.