అలాంటి సినిమాలలో నటించాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన రకుల్?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ ఆ సినిమా హిట్ అవ్వటంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇలా తను నటించిన సినిమాలలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇలా ఇలా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా బాగా ఫేమస్ అయిన రకుల్ కి బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా రావడంతో సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేయటం పూర్తిగా తగ్గించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు నితిన్ నటించిన చెక్ సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టా రీల్స్ తో పాటు తన అందమైన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రకుల్ సినిమాల విషయంలో తన మనసులోని మాటలను బయటపెట్టింది. ఈ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాను. కానీ . గొప్పగా చెప్పుకునేవారి జీవిత కథతో ఒక బయోపిక్ చేయాలని ఉంది . అంతేకాకుండా దిల్ వాలే దుల్హానియా లేజాయింగే వంటి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ ఉన్న సినిమాలలో నటించాలని నాకు ఆశగా ఉంది. లవ్ స్టోరీస్, బయోపిక్స్ చేయటమంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చింది రకుల్.