విశాఖ ఉక్కు పాపం టీడీపీ మెడకు చుట్టిన గంటా..!

ganta srinivas rao

 ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టీడీపీ పార్టీ అధికార వైసీపీ పార్టీని కార్నర్ చేస్తుంది. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అధీనంలో ఉంటుంది. ఏదైనా టార్గెట్ చేయాలంటే కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ, నిరసన తెలపాలి కానీ, ప్రతిపక్ష టీడీపీ ఆ పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇరుగున పెడుతుంది.

ganta srinivas rao

 ఇలాంటి సమయంలో టీడీపీని ఇరుగున పెట్టె విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపంలో టీడీపీకి వాటా ఉందంటూ బాంబు పేల్చాడు గంటా , ఆ మాటలు ఇప్పుడు తెలుగుదేశం వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 విశాఖ లో ఉక్కు నిలబడాలంటే అది ఒక్క టీడీపీతోనే సాధ్యమని చెప్పుకునే పచ్చ పార్టీ నేతలు ఇప్పుడు గంటా వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి విశాఖ ఉక్కు విషయంలో ఎటువంటి రాజీనామాలు చేయటానికి వీలులేదని టీడీపీ భావించిన కానీ, దానిని విరుద్ధంగా గంటా రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు.

 దానితో ఆగకుండా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పాపంలో తెలుగుదేశం వాటా కూడా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే, టీడీపీతో తెగదెంపులు చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది.