నా భర్తను వదిలెయ్యి అంటూ వార్నింగ్.. వినలేదు.. బ్లేడుతో కోసి హత్య.. చివరికి?

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలలో ఎక్కువగా అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల కాపురాలు జీవితాలు నాశనం అవుతాయని తెలిసి కూడా ఎక్కువగా అక్రమ సంబంధాల పై మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… విజయవాడలోని కృష్ణలంకలో రాణి వారి తోట ప్రాంతానికి చెందిన సత్య ఆమె కూతురు, భర్త నివసిస్తున్నారు.

ఆమె విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ లో స్విపర్ గా పనిచేస్తుంది. ఆమె కుమార్తె ఎనిమిదో తరగతి చదువుకుంటూ అప్పుడప్పుడు క్యాటరింగ్ పనులకు వెళ్తూ ఉండేది. వ్యసనాలకు బానిస అయిన సత్య భర్త ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఆదినారాయణతో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం సత్య భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయం ఆదినారాయణ భార్యకు తెలియడంతో ఆమె సత్యతో గొడవ పడుతూ ఉండేది.

సత్య ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే ఆదినారాయణ సత్య ఇల్లు ఖాళీ చేయించి అతని ఇంటి సమీపంలో ఒక ఇంటిలో ఉంచాడు.అప్పటి నుంచి నిత్యం ఆదినారాయణ సత్య ఇంటికి వచ్చేవాడు. ఇది చూసి తట్టుకోలేక ఆదినారాయణ భార్య సత్య ఇంటికి వెళ్ళి గొడవపడి ఆమెని చంపేస్తా అని బెదిరించింది. ఈ క్రమంలోనే మరోసారి సత్య ఇంటికి వెళ్లిన మల్లేశ్వరి ఆమెతో గొడవ పడి తనవెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోసి, రోకలిబండతో తలపై గట్టిగా కొట్టి చంపేసింది. అనంతరం ఇంటి తలుపులు వేసి వెళ్ళిపోయింది. కాసేపటికి సత్య కుమార్తె వచ్చి చూసి భయంతో ఇంటి పక్కన వాళ్లందరినీ భయంతో పిలిచింది. చుట్టు పక్కల ఉన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు డాగ్ స్క్వాడ్ తో దిగారు. అవి వాసనను పసిగట్టి మల్లేశ్వరి ఇంటి దగ్గరకు వెళ్లి ఆగాయి, వెంటనే ఆమెను పోలీసులు విచారించగా ఆమె నేరాన్ని అంగీకరించింది.