వ్యాపారి చేసిన నిర్వాకం.. ఆస్పత్రి పాలైన విద్యార్థి..

విజయవాడ నగరానికి చెందిన కోసూరు చైతన్య అనే ఓ విద్యార్థి లయోలా కళాశాలలో ఏవియేషన్ విభాగంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దీంతో ఈనెల 14న ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాహం వేయడంతో ఎనికేపాడు వద్ద ఓ దుకాణం లో వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తారు.

ఇక ఆ వ్యాపారి చేసిన నిర్వాకం ఏంటంటే.. అతడికి వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఇక చైతన్య వెంటనే యాసిడ్ ను తాగడంతో తనపై తీవ్రమైన ప్రభావం ఎదురవగానే వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యాసిడ్ ప్రభావం వల్ల అతడి శరీరంలో అవయవాలు పాడయ్యాయని తెలిసింది. ఇక అతడు ఆర్థికపరంగా అంతంతగానే ఉండటంతో అతడి కాలేజ్ విద్యార్థులు అతని ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించారు.