Vijayasai Reddy: గుంట నక్కలను చంద్రబాబు ఉసిగొల్పుతున్నాడంటున్న విజయసాయిరెడ్డి..

Vijayasai Reddy: ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతుంది. తమ వర్గంపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరి మధ్య పోటాపోటీగా మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికగా మరో ట్వీట్ చేశాడు.

బండ్ల గణేష్ ను ఉద్దేశిస్తూ.. చంద్రబాబుపై మరోసారి ఆరోపణలు చేశాడు సాయి రెడ్డి. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తిట్టేంచేందుకు చంద్రబాబు గుంటనక్కన్నాడని వ్యాఖ్యలు చేశాడు. ఆ గుంట నక్కల ను ఊళలకు సంబరపడే నార్సిసిస్టిక్ జబ్బు చంద్రబాబుకి జిగురులా పట్టుకుందని విమర్శించాడు. అంతే కాకుండా మరికొన్ని వ్యాఖ్యలతో విమర్శించారు.. మరోసారి బండ్ల ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.