ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ మాయామశ్చింద్రానే..!

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజాగా ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ పై ట్విట్ట‌ర్‌లో చేసిన వ్యాఖ్య‌లు ర‌చ్చ లేపుతున్నాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ప్రజలను మాయ చేయడంలో మాత్రం, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కంటే ఒక ఆకు ఎక్కువే చదివారని, జగన్ ప్రకటిస్తున్న పథకాలన్నీ మాయామశ్చీంద్రను తలపిస్తున్నాయ‌ని ఆర్కే కొత్త‌ప‌లుకు శీర్షిక‌లో భాగంగా ఓ క‌థ‌నం రాశారు.

ఈ నేప‌ధ్యంలో విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా రాధాకృష్ణ‌కు కౌంట‌ర్ ఇచ్చారు. దేశంలోనే డ‌ర్టీయెస్ట్ పొలిటీషియ‌న్ గురించి నీ చెత్త ప‌లుకులో ఏనాడైనా రాశావా ఆర్కే.. నీ దిక్కుమాలిన విష‌పురాత‌లు గురించి తెలుగు ప్ర‌జ‌లకు ఎప్పుడో తెలిసిపోయింది.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా జ‌గ‌నే నీ టార్గెట్, రాష్ట్ర‌ప్ర‌జ‌లు అంద‌‌రికీ వైద్యం అందాల‌నే ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీని విస్తరించినా, వారి భ‌విష్య‌త్తుకోసం అమ్మఒడి పెట్టినా పొర్లి పొర్లి ఏడుస్తావ్.. నీ ఫ‌స్ట్రేష‌న్ ఏ స్థాయికి చేరుకుందో అర్ధ‌మవుతోంది, స‌క్షేమ ‌ప‌థ‌కాల‌ను మాయామ‌శ్చీంద్ర అంటావా అంటూ ట్విట్ట‌ర్‌లో ఆర్కే పై విజ‌య‌సాయిరెడ్డి విరుచుప‌డ్డారు. మ‌రి విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల పై ఆర్కే రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.