కరోనా దెబ్బకు తెలుగు ఇండస్ట్రీ విలవిలాడుతోంది. సినిమాలన్నీ ఆగిపోయాయి. షూటింగ్ ఏ స్థాయిలో ఉన్నా వదిలేసి ఇళ్లకు పరిమితమవుతున్నారు హీరోలు. కొత్త సినిమాలకు కూడ సైన్ చెయ్యట్లేదు. దీంతో యంగ్ డైరెక్టర్లకు హీరోల డేట్స్ దొరకట్లేదు. అందరూ ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. హిట్ కొట్టిన దర్శకులకు కూడ సినిమాలు లేకుండా ఉండిపోతున్నారు. ఈ హీరో దగ్గరికెళ్ళినా అన్నీ చక్కబడ్డాక చూద్దాం అంటున్నారే కానీ ఇప్పుడప్పుడే సినిమాను మొదలుపెట్టేలా అయితే కనబడట్లేదు. అందుకే ఒక హిట్ డైరెక్టర్ మరోసారి అసిస్టెంట్గా మారాడు.
అతనే వెంకీ కుడుములు. త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన ఇతను ‘చలో, భీష్మ’ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను చేశాడు. మూడవ సినిమా కోసం హీరోను వెతుకుతుండగా అనుకున్న హీరో డేట్స్ ఇప్పుడప్పుడే దొరికేలా కనిపించలేదు. ఈ సమయంలోనే అతనికి త్రివిక్రమ్ సినిమా నుండి పిలుపు వచ్చింది. త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసే కొడైరెక్టర్ ఇటీవలే మరణించాడు. ఈలోపు త్రివిక్రమ్, మహేష్ సినిమా ఓకే అయింది. ఈ సినిమాకు పనిచేయమని ఆ చిత్ర నిర్మాత రాధాకృష్ణ వెంకీ కుడుములు కోరడం జరిగిందట. వెంకీ ‘భీష్మ’ సినిమాకు నిర్మాత ఆయనే. ఎలాగూ హీరో చేతిలో లేడు కాబట్టి వెంకీ కూడ గురువు సినిమాకు సహకారం అందించడానికి ఓకే చెప్పాడట.