రెబెల్ ఎమ్మెల్యే అంటే ఏంటో చూపించిన వాసుపల్లి గణేశ్ కుమార్ .. ఉలిక్కిపడ్డ చంద్రబాబు !

VasupalliGaneshKumar

వైసీపీ తరపున ఎంపీగా గెలిచి ఇప్పుడు అదే పార్టీకి రెబల్ గా మారిన రఘురామ కృష్ణంరాజు ఎలాగైతే వైసీపీకీ చుక్కలు చూపిస్తున్నారో అలాగే ఇప్పుడు టీడీపీను వైసీపీలోకి చేరనున్న వాసుపల్లి గణేష్ కూడా టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీపై, చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పదమూడేళ్ళ పాటు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన తననే హింసించిన పసుపు పార్టీ పెద్దలకు పరాభవం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు.

TDP MLA Vasupalli Ganesh Kumar
TDP MLA Vasupalli Ganesh Kumar to Meet CM YS Jagan

బాబుకు విశాఖ అంటే గిట్టదా!

చంద్రబాబునాయుడుకి ఆది నుంచి విశాఖ అంటే ఇష్టం లేదుట. ఆయన విశాఖ రాజధానిని కావాలని తొక్కిపెట్టి తన మనసులో అప్పటికే అనుకున్న అమరావతిని రాజధానిని చేశారని గణేష్ వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని ప్రాంతాలలో సర్వే చేస్తే అమరావతికే జనం జై కొట్టారని బాబు అంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే ఆ సర్వే తప్పని వాసుపల్లి గణేష్ వెల్లడిస్తున్నారు. నాడు టీడీపీ చేసిన సర్వేలో విశాఖకే రాజధాని కావాలని ఎక్కువమంది ఓటు చేశారట. కానీ బాబు మాత్రం తన కుటిల రాజనీతితో గుంటూరు, క్రిష్ణా జిల్లాల ఓట్లను కూడా కలిపేసి విశాఖ కంటే ఎక్కువ చూపించి అమరావతికే మద్దతు ఉందని మభ్యపెట్టారని వాసుపల్లి గణేష్ అంటున్నారు.

బాబుకు కష్టాలు తెస్తున్న గణేష్

చంద్రబాబు నాయుడుకు పార్టీ పరంగా ఇప్పటికే అనేక కష్టాలు ఉన్నాయి. పార్టీ దాదాపు పతనం అయ్యే స్థితికి చేరుకుంది. అయితే ఇలాంటి సందర్భంలో వాసుపల్లి గణేష్ వల్ల చంద్రబాబు నాయుడుకు కొత్త కష్టాలు వస్తున్నాయి. విశాఖ అంటే బాబుకు ఇష్టం లేదని గణేష్ చేస్తున్న వ్యాఖ్యలు బాబును విశాఖ ప్రజల దృష్టిలో విలన్ గా చూపించే అవకాశం ఉంది. మరి గణేష్ వస్తున్న ఈ ఆరోపణలను చంద్రబాబు నాయుడు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.