ఆర్సీబీ బౌలర్లను చితగ్గొట్టిన చెన్నై!

చెన్నై సూపర్ కింగ్స్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఊతప్ప 50 బంతుల్లో 88 పరుగులు చేయగా.. దూబే 46 బంతుల్లో 95 పరుగులతో ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. వీరి విజృంభణతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 రన్స్‌ చేసింది. ఆర్సీబీ బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ 4 ఓవర్లలోనే 58 పరుగులు సమర్పించుకున్నాడు.