Crime News: ట్యూషన్ టీచర్ అరాచకం.. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ..!

Crime News: సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. ఇల్లు, ఆఫీస్, స్కూల్, కాలేజీ ఇలా ఏ ప్రదేశంలో అయినా ఆడవారు స్వతంత్రంగా జీవించలేక పోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. స్కూల్, కాలేజీ లలో చదువు చెప్పి విద్యార్థుల అభివృద్ది కోసం కృషి చేయాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులు పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువులే పిల్లల పట్ల గాయాలకు పడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే… విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేసిన నీచపు ఉపాధ్యాయుడిని గ్రామస్తులు చితక బాదారు.రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో సాల్మన్ రాజు టీచర్‌గా పని చేస్తున్నాడు. సాల్మన్ రాజు ఉదయం, సాయంత్రం వేళలో పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో ట్యూషన్‌ సెంటర్‌ నిర్వహిస్తు ప్రాథమిక విద్య చదువుతున్న పిల్లలకు ట్యూషన్స్ చెబుతుంటాడు.

సాల్మన్ నిర్వహిస్తున్న ట్యూషన్ కు వెళుతున్న ఒక విద్యార్థి సోమవారం ట్యూషన్ కి వెళ్ళకుండా ఇంట్లో ఉండటంతో తల్లి నిలదీసింది. విద్యార్థి బాధపడుతూ ట్యూషన్ లో ఉపాధ్యాయుడు చేస్తున్న నీచపు పనుల గురించి తల్లితో వివరించింది. దీంతో ఆగ్రహం చెందిన మహిళ తోటి మహిళలు స్థానికులతో కలిసి ఇ ట్యూషన్ మీద దాడికి చేసి సాల్మన్ రాజు నీ నిలదీసి చితకబాదారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్థానికులు కొట్టిన దెబ్బలకు చికిత్స అందించడానికి ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.