ప్రభాస్‌ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

ప్రభాస్‌ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘రాధేశ్యామ్‌’ సినిమా ఐదో ఆటకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 11 నుంచి 25 వరకూ థియేటర్లు ఐదో షోను ప్రదర్శించుకోవచ్చు. ప్రభాస్‌ లవర్‌బాయ్‌ రోల్‌ పోషించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో
పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించారు. రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.