TS CM KCR: కేసీఆర్ తో అద్భుతమైన సమయాన్ని గడిపా – స్టాలిన్

TS CM KCR: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్టాల ముఖ్య మంత్రులు పలు అంశాలను గురించి చర్చించారు. వచ్చే కొత్త ఏడాది మార్చి 28వ తేదీన యాదాద్రి ఆలయం పున: ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ ప్రారంభానికి రావాలని స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. అంతేకాకుండా ఫెడరల్ ప్రంట్ గురించి కూడా చర్చలు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని అని అన్నారు. సీఎం కేసీఆర్ తనను చాలా మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. ఈ భేటీలో నదీజలాల వివాదాలు, ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంలో బిజేపి వైఖరి.. అలా ఇతర అంశాలపై కేసీఆర్, స్టాలిన్ చర్చించుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా విలక్షణ నటుడు కమల్ హాసన్ తో కూడా సీఎం సమావేశం అయ్యారని వినికిడి.