Trivikram Srinivas: త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా… మామ అల్లుడితో మల్టీస్టారర్ ప్లాన్!

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు దర్శక పర్యవేక్షకుడుగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో తన తదుపరి చిత్రం చేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఆయన దర్శకత్వం వ్యవహరిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన మామ పవన్ కళ్యాణ్ అల్లుడు, సాయి ధరమ్ తేజ్ తో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. “వినోదయ సితం” అనే తమిళ సినిమా ఎంతో మంచి విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు రీమేక్ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీ స్టూడియోస్ ఈ రీమేక్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించినున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఇలా మెగా మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేయనున్నారని తెలియడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమా గురించి మరింత సమాచారం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.