ఓనం పండుగ సంబరాలలో విషాదం… పడవ బోల్తా పడి ఇద్దరు మృతి!

కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ సంబరాలు చాలా ఘనంగా పూర్తీ అయ్యాయి. అయితే ఓనం పండుగ సందర్భంగా సంబరాలలో పాల్గొన్న కొంతమంది యువకులు అనుకోని ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. కేరళ రాష్ట్రంలోని చెన్నితాలలో ఉన్న అచ్చన్‌కోవిల్ నదిలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దురు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతు ఆయ్యారు.

వివరాలలోకి వెళితే…కేరళ ప్రజలు ఘనంగా జరుపుకునే పూనం పండుగలో విషాదం నెలకొంది. కేరళలోని చెన్నితాలలో ఉన్న అచ్చన్కోవిల్ నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓనం పండుగ సందర్భంగా కేరళలో పడవ పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా చెన్నితాలలో ఉన్న అచ్చన్కోవిల్ నదిలో పడవ పోటీలు నిర్వహించారు. అయితే అనుకోకుండా పడవ బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ..మరో ఇద్దరు వ్యక్తులు నీటిలో గల్లంతు అయ్యారు.

స్థానికులు వెంటనే ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్ సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అరన్ముల బోట్ రేస్‌ ఉండటంతో పోటీలో పాల్గొనటానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 60 మంది ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడయింది.