Tolly Wood Anchors: యాంకర్లగా తెలుగు ప్రేక్షకులను అలరించి హీరోయిన్లగా ఎంట్రీ ఇచ్చింది వీళ్ళే!

Tolly Wood Anchors: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పేరు గాంచిన అందమైన యాంకర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ యాంకర్స్ కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వారి సత్తా ఏంటో నిరూపించుకుంటూ వెండితెరపై అవకాశాలను అందుకుని దూసుకుపోతున్నారు. మరి యాంకర్లుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన వీళ్ళు వెండితెరపై హీరోయిన్స్ గా నటిస్తూ దూసుకుపోతున్నారు. మరి వారు ఎవరూ అనే విషయానికి వస్తే…

సుమ: ఈమె కెరియర్ మొదట్లో పలు సీరియల్స్ లో నటించి అనంతరం యాంకర్ గా మారారు.యాంకర్ గా కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు.

అనసూయ: అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె వెండితెరపై రంగమ్మత్త పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

రష్మి గౌతమ్: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రష్మి చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఉన్నారు అలాగే మెగాస్టార్ నటిస్తున్నటువంటి భోళా శంకర్ సినిమాలో ఐటెం సాంగులో నటించడానికి సిద్ధమైంది.

శ్రీముఖి: పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరపై తళుక్కుమన్న ఈమె అంతకుముందే పలు చిత్రాలలో చెల్లెలి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా క్రేజీ అంకుల్స్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాంకరమ్మ ఆ తర్వాత పలు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. వీళ్ల బాటలోనే కలర్ స్వాతి, రెజీనా, విష్ణు ప్రియ, మెగా డాటర్ నిహారిక వంటి వారు కూడా కెరియర్ మొదట్లో యాంకర్ గా పరిచయం అయి ఆ తరువాత హీరోయిన్లుగా కొనసాగారు.