కృష్ణ విషాదం – ప్రభాస్ ఇంకా స్పందిచకపోడానికి కారణం ఇదే.!

టాలీవుడ్ లో ఈరోజు ఉదయమే ఓ ఊహించని షాకింగ్ వార్త అయితే బయటకి వచ్చి సినీ శ్రేణుల్ని షాక్ కి గురి చేసింది. సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం మరణించారని తెలిసింది. దీనితో మహేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొనగా ఇప్పుడు ఈ ఘటన పట్ల అయితే ఈరోజు ఉదయం నుంచే అనేక మంది ప్రముఖులు మహేష్ ఇంటికి వెళ్లి మరీ నివాళులు అర్పించారు.

మరికొంతమంది సోషల్ మీడియాలో తమ స్పందనను వ్యక్తం చేశారు. అయితే ఇంకా ఈరోజు విషయం తేలికో లేక ఎందుకో మాట్లాడని పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు కొందరు ఉన్నారు. మరి టాలీవుడ్ నుంచి అయితే ప్రభాస్ ఇంకా ఎలాంటి పోస్ట్ కానీ ఇంకా మహేష్ ఇంటికి వెళ్లడం కానీ చేయలేదు. దీనితో ఇది ఆసక్తిగా మారింది.

కృష్ణం రాజు గారి మరణం సమయంలో మహేష్ ప్రభాస్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అయితే ఇందులో అభిమానులు కంగారు పడాల్సింది లేదట. ప్రభాస్ కి విషయం లేట్ గా తెలియగా తాను వెళ్లి ఖచ్చితంగా కలుస్తాడని ప్రభాస్ దగ్గర వర్గాల నుంచి ప్రస్తుత సమాచారం. దీనితో వీరి కలయిక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.