అల్లు అరవింద్ ని మోసం చేసిన స్టార్ దర్శకుడు.?

తెలుగు సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ అండ్ సీనియర్ నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు. మరి అల్లు అరవింద్ అయితే ఇప్పుడు పలు తెలుగు సహా హిందీ సినిమాలు కూడా చేస్తుండగా వారి బ్యానర్ లో వచ్చిన చిత్రాలు చాలానే ఈ మధ్య కాలంలో హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన సినిమా “గీతా గోవిందం” కూడా ఒకటి.

అయితే ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ హిట్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా భారీ లాభాలు కూడా అందించి పెట్టింది. అయితే ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కి సీక్వెల్ కూడా ఇటీవలే అనౌన్స్ అయ్యింది.

మరి ఈ సినిమా దర్శకుడే ఇప్పుడు అల్లు అరవింద్ కి షాకిచ్చినట్టుగా సినీ వర్గాల్లో గాసిప్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా సీక్వెల్ ని మొదట పరశురామ్ అల్లు అరవింద్ కే కమిట్మెంట్ యివ్వగా ఇప్పుడు దానిని కాస్తా దిల్ రాజు తో అనౌన్స్ చేయడం షాకింగ్ గా మారింది.

దీనితో ఈ మేటర్ పైనే అల్లు అరవింద్ సీరియస్ కాగా దీనిపైనే ఈరోజు సాయంత్రం ఆకస్మిక ప్రెస్ మీట్ పెట్టి వారికి వార్నింగ్ ఇవ్వనున్నారని రూమర్ వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ మీటింగ్ మళ్ళీ నిలిచిపోయినట్టుగా కూడా అప్డేట్ వచ్చింది. కానీ మొత్తానికి అయితే ఈ సర్కారు వారి పాట దర్శకుడు మాత్రం అల్లు అరవింద్ కి హ్యాండ్ ఇచ్చాడు అని కొందరు అనుకుంటున్నారు.