రామ్ తన దర్శకునికి ఎందుకు ఓపెన్ గా సారీ చెప్పాడో అసలు కారణం ఇదే.!

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ఒకడు. అయితే రామ్ ఇపుడు తనకు “ఇస్మార్ట్ శంకర్” తో వచ్చిన మాస్ ఇమేజ్ ని మరింత పెంచుకుంటూ మరిన్ని మాస్ చిత్రాలు తాను చేస్తున్నాడు. అలా “రెడ్” తర్వాత ఊహించని కాంబో తమిళ మాస్ సినిమాల స్పెషలిస్ట్ ఎన్ లింగుసామి తో “వారియర్” అనే సాలిడ్ ఏక్షన్ ఫిల్మ్ ని అనౌన్స్ చేసాడు. 

మరి ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉండగా రామ్ నుంచి ఈ దర్శకునికి బహిరంగ క్షమాపణ చెప్తూ ఓ పోస్ట్ రావడం చాలా మందికి ఆశ్చర్యంగా మారింది. అసలు ఏమైంది అని రామ్ గత పోస్టులు కూడా అంతా వెతుకుతున్నారు. మరి ఈ సడెన్ పోస్ట్ పై కారణం క్లారిటీ ఏంటో ఇప్పుడు తెలుస్తున్నాయి. 

నిన్న ఈ సినిమా బృందం ఒక ప్రెస్ మీట్ ని అయితే నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రామ్ ఈ సినిమా అసలు పిల్లర్ దర్శకుడు లింగుసామి కోసమే చెప్పడం మర్చిపోయాడు. దీనితో మళ్ళి అది గుర్తించి తన సోషల్ మీడియా ద్వారా తాను అలా మర్చిపోయినందుకు లింగుసామి కి సారీ చెప్పి తనని క్షమించమని కోరాడు. ఇది రామ్ సారీ వెనుక ఉన్న స్టోరీ..