అయ్యో.! మొన్న ప్రగ్యా..ఇప్పుడు ఊర్మిళ.. ఏమైందంటే.!

‘రంగీలా’ సినిమాతో ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ ఊర్మిళ మటోడ్కర్. ఆ తరం హాట్ హీరోయిన్లలో ఊర్మిళ ఒకరు. యూత్‌లో పిచ్చ క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉందనుకోండి. శివసేన నేతగా రాజకీయాల్లో బిజీగా గడుపుతోంది.

అసలు వివరాల్లోకి వెళితే, ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోవిడ్ బారిన పడిందట. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది ఊర్మిళ. ‘మైల్డ్ సింప్టమ్స్‌ కనిపించడంతో, ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాననీ, హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను..’ అని ఊర్మిళ తెలిపింది.

గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లంతా టెస్ట్ చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే రాబోయే పండగ దీపావళిని కూడా కోవిడ్ నిబంధనల నడుమ సేఫ్‌గా జరుపుకోవాలని ఊర్మిళ సూచించింది. ఇకపోతే, ఈ మధ్య టాలీవుడ్ భామ ప్రగ్యా జైశ్వాల్‌ కూడా కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే.