Crime News: ఆస్తి కోసం సొంత అక్కని పొట్టనపెట్టుకున్న చెల్లెలు.. దారుణంగా కిరోసిన్ పోసి..!

Crime News: ఈ రోజుల్లో మనుషులు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. తల్లి, తండ్రి అక్క, చెల్లి అని ప్రేమ ఆప్యాయతలు లేకుండా డబ్బు కోసం ప్రాణాలు తీసే స్థాయికి దిగజారి పోయారు. ఇటీవల ఆస్తి కోసం తన సొంత అక్కనే చంపింది తన చెల్లెలు. ఈ విషాద సంఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పుట్టింటి తరుపు నుండి వచ్చే ఆస్తి కోసం తన సొంత అక్క మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించింది.

వివరాలలోకి వెళితే..మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్‌కు నలుగురు కుమార్తెలు. వీరికి కుమారులు ఎవరు లేకపోవటంతో తనకు ఉన్న ఆస్తి కుమార్తెలకు పంచి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్క చెల్లెళ్ల మధ్య ఆస్తికి సంబంధించి వివాదం జరిగింది. చిన్న మల్లారెడ్డి పెద్ద కుమార్తె వరలక్ష్మి వడియారం గ్రామంలో అద్దెఇంట్లో ఉంటుంది.

సోమవారం వరలక్ష్మి చెల్లెలు రాజేశ్వరి వడియారం గ్రామంలో ఉంటున్న వరలక్ష్మి ఇంటికి వచ్చింది. అక్కడ వారిద్దరికీ ఆస్తి విషయమై గొడవ జరిగింది. దాంతో కోపం వచ్చిన రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ వరలక్ష్మి పై పోసి నిప్పంటించింది. ఆ మంటలకు తట్టుకోలేక వరలక్ష్మి తన చెల్లిని వటేసుకోడంతో ఇద్దరు మంటల వల్ల గాయపడ్డారు. ఇంట్లోనే ఉన్న వరలక్ష్మి పిల్లలు భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పి,108 కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తరలించారు. వరలక్ష్మీ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా,రాజేశ్వరిని తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.