Crime News: మద్యం మత్తులో అక్క మీద దాడి చేసిన తమ్ముడు.. కడుపులో బలంగా తన్నటంతో మహిళ మృతి..!

Crime News: ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు మద్యానికి అలవాటు పడి బానిసలవుతున్నారు. ఈ మధ్యన అలవాటు కారణంగా ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం అలవాటు కారణంగా మద్యం మత్తులో కొంతమంది దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో యువకుడు తన అక్కను పొట్టన పెట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే… మద్యం మత్తులో క్షణికావేశంలో యువకుడు చేసిన పని వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. గిరినగర్‌కు చెందిన మల్లేష్ అనే వ్యక్తి తన చిన్న కుమార్తె, కొడుకుతో కలిసి గత నెలలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పెద్ద కుమార్తె కనకలక్ష్మి(40) ఇంటికి వెళ్ళారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన అందరూ కలిసి బల్కంపేట ఎల్లమ్మ గుడి కి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. కనక లక్ష్మీ భర్త తండ్రి తమ్ముడు ముగ్గురు కలిసి మద్యం తాగి రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో కూడా వారి వెంట కల్లు తెచ్చుకున్నారు.

ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి పొద్దుపోయిన కూడా ముగ్గురూ కలిసి ఇ కళ్ళు సాగుతుండటంతో కనక లక్ష్మీ వచ్చి వారిని మందలించింది. ఇంకా ఎన్నిరోజులు ఇక్కడే ఉంటారు ఇంటికి వెళ్ళండి అంటూ కనకలక్ష్మి తండ్రిని ప్రశ్నించగా మల్లేష్ అక్కడినుండి మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాడు. కానీ కనకలక్ష్మి తమ్ముడు మద్యం మత్తులో ఉండటం వల్ల కనక లక్ష్మీ ప్రశ్నించడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆవేశంతో చెంపమీద గట్టిగా కొట్టి కడుపులో బలంగా తన్నాడు. అలా తన్నటంతో కనకలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె భర్త తండ్రి కలసి చికిత్సకోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.