Crime News: అప్పు ఇచ్చిన వ్యక్తితో కలిసి భర్తను కడతేర్చిన భార్య.. అక్రమ సంబంధమే కారణం..!

Crime News: కలకాలం భర్తతో కలిసి జీవించాల్సిన భార్యనే భర్తను కడతేర్చింది. అక్రమ సంబంధం కొనసాగించేందుకు తాళి కట్టిన భర్తనే పథకం పన్ని హతమార్చింది.వివరాల్లోకి వెళితే శ్రీశైలం, గీత అనే దంపతులు తెలంగాణలోని జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామం లోని హరిజన వాడ లో నివసించేవారు. వీరు గత కొన్ని నెలలుగా బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ కు కూలి పని చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పనిచేసేచోట గీతకు రాజు, విక్రమ్ అనే వ్యక్తులు పరిచయం అయ్యారు. కుటుంబ పోషణ కోసం గీత వీరి వద్దనుండి 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. అప్పు ను సాకుగా చూపుతూ విక్రమ్ గీతతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు.

భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న శ్రీశైలం తో కలిసి సొంత ఊరైన బూరుగుపల్లి కి చేరుకున్నారు. శ్రీశైలం ఊరి లోనే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ప్రియుడు మోజులో ఉన్న గీత, తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. శ్రీశైలం భార్య గీత, ఆమె తల్లి, విక్రమ్, రాజు లు కలిసి శ్రీశైలాన్ని అంతం చేయడానికి పథకం రచించారు.

దీనిలో భాగంగా గత నెల 31వ తారీఖున రాత్రి 10 గంటల సమయంలో, డబ్బు విషయమై మాట్లాడాలని శ్రీశైలానికి చెప్పి ఊరి చివరన ఉన్న వ్యవసాయ పొలాలకు రప్పించారు. శ్రీశైలానికి ఫుల్లుగా మద్యం తాపించి కళ్ళలోకి కారంకొట్టి రాడ్ తో అతని తల మీద దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మీద పోలీసులు తన స్టైల్లో విచారణ జరపగా భార్య హంతకురాలు అని తేలింది.