జూబ్లీహిల్స్ ఘటనలో మరో విషయం బయటపెట్టిన బాధితురాలు..

ఇటీవలే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు స్పందించి ప్రభుత్వం తీరుపై, పోలీసుల యాక్షన్ పై మండిపడ్డారు. ఇక తాజాగా అత్యాచారానికి గురైన బాధితురాలి రెండో స్టేట్ మెంట్ రికార్డులో కొన్ని నిజాలు బయటపడ్డాయి.

తనని ఇంటి వద్ద దింపుతామని ట్రాప్ చేసి అత్యాచారం చేశారని తెలిపింది. తనని వెంబడించి క్యాబ్ బుక్ చేస్తాము అంటూ నిందితులు ఫోన్ లాక్కున్నారు అని.. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని.. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామంటూ బెంజ్ కార్ లో తీసుకెళ్లి తన హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు లాక్కున్నారని తెలిపింది. ఇక కాన్స్ బేకరీ వద్దకు రాగానే ఇన్నోవాలోకి షిఫ్ట్ చేశారు. అందులో తనపై అఘాత్యానికి పాల్పడినట్లు తెలిపింది.