Crime News: దయ్యాలు వదిలిస్తానంటూ ఇంట్లోకి ప్రవేశించి తల్లిదండ్రుల ముందే దారుణం…

Crime News:ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అక్కడక్కడ మూఢనమ్మకాలు నమ్మే వారు చాలా మందే ఉన్నారు. భూత వైద్యాలు చేసి ఇంట్లో ఉన్న దెయ్యాలను తరిమి కొడతాం అంటూ చాలామంది లక్షల రూపాయలు పోగు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న దయ్యాలను వదిలేస్తాను అంటూ వచ్చి డబ్బులు తీసుకొని మరి ఇంటి కూతుర్ల మీద, కోడళ్ళు మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఒక వ్యక్తి.

వివరాల్లోకి వెళితే…రాజస్థాన్‌లోని అజ్మీర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రాజీవ్‌ అనే వ్యక్తికి భూత వైద్యుడిగా పేరు ఉంది. భూత వైద్యం పేరుతో ఇతను అందరి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు. పూజలు చేయడానికి ఇంటికి గెలిపించిన వారి ఇ కూతుర్లను, కోడళ్లను గదిలోకి పిలిపించి వారి మీద అత్యాచారాలు చేస్తుంటాడు. ఇటీవల ఇంట్లో ఉన్న దయ్యాన్ని తరిమికొట్టారు రాజీవ్ కి డబ్బులిచ్చి మరి ఇంటికి పిలిపించింది ఒక కుటుంబం.

బాలికను గదిలోకి తీసుకెళ్లి ఆమె చేత గట్టిగా మంత్రాలు చదివించి ఇలా చేస్తే ఉదయం వదులుతుంది అంటూ ఆమె మీద అత్యాచారం చేశాడు. ఇలాగే మరొక ఇంట్లో కూడా పూజలు చేసి ఆ ఇంటి కోడలి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు మహిళ రాజీవ్ చేసిన పనికి నెల 19వ తేదీన రాజీవ్ మీద ఆదర్శనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సదరు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజీవ్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.