Crime News: ఫోన్ కొనివ్వలేదని దారుణానికి పాల్పడిన కొడుకు..రోకలుబండతో కొట్టి మరీ..!

Crime News: ఈ మధ్య కాలంలో యువత మొబైల్ ఫోన్ లకు బాగా అలవాటుపడ్డారు స్కూల్ కెళ్ళి చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్ కావాలంటూ ఇంట్లో మారం చేస్తున్నారు. మొబైల్ కావాలంటూ తల్లితో గొడవపడి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే…గద్వాల జోగులాంబ జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి ,వెంకటేశ్వర్ల దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా పెద్ద కుమారుడు మహెశ్ రోజు వారి కూలి పనులకు వెళుతున్నాడు. అయితే అందరికీ వందనాలు మహేష్ కూడా ఫోన్ కావాలంటే తల్లి ని అడగగా వేల రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనివ్వలేనని తల్లి కొడుకుని మందలించింది.

ఈ క్రమంలో మహేష్ ఫోన్ కోసం మరోసారి తల్లితో గొడవకు దిగాడు. మహేష్ ఆవేశంతో ఇంట్లోని రోకలి బండతో తల్లి తలపై బలంగా కొట్టడడంతో ఆమె తీవ్ర గాయాలపాలై కింద పడిపోయింది. అక్కడిక్కడే సృహ తప్పి పోవడంతో చికిత్స కోసం 108కి కాల్ చేశారు.. కాని అప్పటికే ఆమె మృతి చెందినట్టు 108 సిబ్బంది ధృవీకరించారు.

భర్త అనారోగ్య కారణంగా ఇంటి బాధ్యతలు నెత్తిన పెట్టుకున్న లక్ష్మి ఇటీవల కొడుకు కూడా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాం తో కూలి పనులకు కూడా వెళ్లకుండా కొడుకు కోసం ఇంటివద్దే ఉంటూ భర్త కొడుకు ని జాగ్రత్తగా చూసుకుంటూ వుండేది. కానీ ఈ మధ్య కాలంలో మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్న మహేష్ ఫోన్ కోసం తల్లిని రోకలి బండతో కొట్టి ఆమెను హత మార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.