Bhalakrishana: బోయపాటి రాజమౌళితో సినిమాలు ఎప్పుడు అంటూ బాలయ్యను ప్రశ్నించిన రిపోర్టర్.. దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిన బాలకృష్ణ!

Bhalakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.బోయపాటి శ్రీను కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో బాలకృష్ణ పలు ఆలయాలను సందర్శించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.ఇదివరకే బాలకృష్ణ పలు ఆలయాలను సందర్శించడం తాజాగా అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం లోకల్ మీడియాతో మాట్లాడిన బాలకృష్ణకు రిపోర్టర్ నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.

ఈ సందర్భంగా లోకల్ రిపోర్టర్ బాలకృష్ణ ఉద్దేశిస్తూ రాజమౌళితో మీ సినిమా ఎప్పుడు ఉంటుంది? అలాగే బోయపాటితో మీ తదుపరి చిత్రం ఎప్పుడు అని ప్రశ్నించగా.. అందుకు బాలకృష్ణ రిపోర్టర్ పై చిరుకోపం ప్రదర్శించారు. ఇలా రిపోర్టర్ అడగడంతో బాలకృష్ణ మౌనంగా ఉండిపోవడంతో మరోసారి సదరు రిపోర్టర్ మౌనం అర్ధాంగీకారమా అని ప్రశ్నించాడు. ఇలా రిపోర్టర్స్ వరుస ప్రశ్నలు అడగడంతో ఈ ప్రశ్న పై బాలయ్య స్పందించి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

మౌనం అర్ధాంగీకారం కాదు అప్రస్తుతం అంటూ ఆ రిపోర్టర్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు కాదంటూ చెప్పకనే సదరు రిపోర్టర్ కు అర్థమయ్యేలా బాలకృష్ణ తనకు కౌంటర్ వేస్తూ సమాధానం చెప్పారు. అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.