వెనక్కు తగ్గిన మంచు విష్ణు

‘మోసగాళ్లు’ మూవీ డిసాస్టర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మంచు విష్ణు ఈ సారి ‘జిన్నా’ అనే సినిమా తో రెడీ గా ఉన్నాడు. శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ గా చేసిన సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మీద ఇప్పటికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సన్నీ లియోన్, పాయల్ రాజపు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. అయితే దసరా కానుకగా ‘గాడ్ ఫాదర్’, ‘ఘోస్ట్’ సినిమాలకు పోటీగా ‘జిన్నా’ సినిమాను ముందుగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ వాయిదాపడింది.

నిన్న ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ మూవీ సిజి వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అలాగే దీపావళి కి అయితే సోలో రిలీజ్ కాబట్టి ఎక్కువ థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది అందుకే అక్టోబర్ 21  న దీపావళి కానుకగా ‘జిన్నా’ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ దసరా కానుకగా అక్టోబర్ 5  న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.