Crime News: ప్రియుడితో కలిసి కన్న కూతురిని కడతేర్చిన తల్లి..!

Crime News: ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాల్సిన వారు కామ వాంఛతో అడ్డ దారులలో వెళ్తున్నారు.ఇలా అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పూర్వం పిల్లల కోసం తల్లి తండ్రులు వారి జీవితాలను త్యాగం చేసే వారు. కానీ ప్రస్తుత కాలంలో కొందరు తల్లి తండ్రులు వారి ఆనందం కోసం పిల్లల జీవితాలను పణంగా పెడుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

బద్వేలు మండల పరిధి లోని లక్ష్మీపాలెం గ్రామానికి  రమణమ్మ అదే గ్రామానికి చెందిన గానుగపెంట శీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న రమణమ్మ కూతురు తల్లిని మందలించడంతో ఎలాగైనా ఈ విషయం బయట పడకుండా కూతుర్ని అంతమొందించాలని ప్రియుడితో కలిసి పన్నాగం వేసింది. ఈ క్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న తన కూతురిని ప్రియుడితో కలిసి చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. తర్వాత రమణమ్మ ప్రియుడితో పాటు తన సమీప బంధువైన ఆటోడ్రైవర్‌ మేకల మల్లెంకొండయ్యతో కలసి మృత దేహాన్ని ఆటోలో తీసుకెళ్లి గ్రామ శివారులోని బావిలో పడేశారు.

తర్వాత ఉదయం ఎవ్వరికీ అనుమానం రాకుండా తండ్రి ప్రవర్తన నచ్చకపోవడంతో తన కూతురు ఇలా ఇంటి నుండి వెళ్లిపోయిందని నమ్మించింది. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా రెండు రోజుల తర్వాత గ్రామం సమీపంలోని బావిలో శవమై కనిపించింది. తండ్రి ప్రవర్తన నచ్చాక తన కూతురు ఇలా ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ పోస్టుమార్టం రిపోర్టులో బాధితురాలు హత్య చేయబడిందని రిపోర్టు రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, వారికి సహకరించిన ఆటో డ్రైవర్ ముగ్గురిని నిందితులుగా భావించి ఈ ఆదివారం పోలీసులు వారిని అరెస్టు చేశారు.