Crime News: అక్రమ సంబంధం బయట పడటంతో కన్న కూతురిని కడతేర్చిన తల్లి… ఎక్కడంటే?

Crime News: ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య ప్రేమానురాగాలు కనుమరుగైపోతున్నాయి. భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న వివాహబంధానికి కూడా కళంకము కలిగేలా ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువ అయ్యాయి.ఈ అక్రమ సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కుటుంబ కలహాలు వల్ల ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నారు. ఈ అక్రమ సంబంధాల వల్ల కడుపున పుట్టిన వారిని కూడా కడతేర్చటానికి వెనకాడటం లేదు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా బోనకల్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. తన తాత,తల్లి మద్య ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసిందని కన్ని కూతురిని తన మామ తో కలిసి పొట్టన పెట్టుకుంది. బోనకల్‌కు చెందిన హరికృష్ణ- సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. హరికృష్ణ లారీ,ఆటో నడుపుతూ పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఈ తరుణంలో తన భర్త తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇలా వారిద్దరూ ఒకే గదిలో ఉండటం పెద్ద కూతురు మహాదేవి చూసింది. తన భర్తకు విషయం చెబుతుందని భయంతో తన మామ తో కలిసి కన్న కూతురిని కాళ్లు చేతులు కట్టేసి వైరుతో మెడకి బిగించి హత్య చేశారు. ఈ తరుణంలో తన కూతురు స్కూల్ లో ఫిట్స్ రావటం వల్ల చనిపోయిందని అందరినీ నమ్మించారు.

అయితే బాలిక మెడమీద కమిలిన గాయాలు ఉండటంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో బాలికను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో వాలిక హత్య కు గురైనట్టు రావటంతో బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో బాలిక తల్లి, తాత నేరాన్ని అంగీకరించడంతో వారి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.