Crime News: కూతురి చావుకు కారణమైన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన తల్లి..!

Crime News:నవమాసాలు మోసి కని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోవడంతో మానసికంగా క్రుంగిపోయిన తల్లి తన కూతురు చావుకు కారణమైన వ్యక్తిని కూడా అంత చేయాలని పగ పెంచుతుంది. ఈ క్రమంలో కొడుకుతో కలిసి పథకం ప్రకారం తన కూతురు చావుకు కారణమైన వ్యక్తిని హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే…మేడ్చల్ పరిధిలోని డీజే ఆర్ కాలనీలో నివసిస్తున్నా వెంకట లక్ష్మి కుటుంబంతో గొడవలు ఉన్న కారణంగా అదే కాలానికి నిజమే వెంకట లక్ష్మి కూతురు భార్గవి గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో లో రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. రాము అనే వ్యక్తి వేధింపులు ఎక్కువవడంతో ఇటీవల భార్గవి ఆత్మహత్య చేసుకొని మరణించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు రాము వేధింపుల కారణంగా మరణించిన వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు రాము మీద పగ పెంచుకొని ఎలాగైనా అతన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో మేడ్చల్ పరిధిలో తల్లి కొడుకు కలిసి రాముని దారుణంగా హత్య చేసి ఆటోలో మృతదేహాన్ని తీసుకు వెళ్లి బీబీనగర్ మండలం రామారావు పేట వద్ద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తరువాత ఇద్దరు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. తల్లి కొడుకులు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు రామారావు పేట శివారులో పరిశీలించగా రాము మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని భువనగిరికి తరలించి ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.