దారుణం.. తల మొండెం వేరు చేసి ఆపై పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి?

రోజు రోజుకి సమాజంలో మానవత్వం మంటగలిసి పోతుంది. ఎదుటి వ్యక్తిని చంపడం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది. కొందరు అయితే మానవత్వాన్ని మరిచిపోయి మరి అతి దారుణంగా క్రూరంగా చంపుతున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలకు ఏకంగా మనిషి ప్రాణాలు సైతం తీస్తున్నారు. సమాజంలో జరిగే కొన్ని హత్యలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనుషుల్ని మనుషులే దారుణంగా అతికిరాతకంగా చంపుతూ జంతువులలా ప్రవర్తిస్తున్నారు. మనుషులుగా సాటి మనుషుల పట్ల ప్రేమను చూపించాల్సింది పోయి, కత్తులతో గొడ్డలితో చెప్పుకుంటున్నారు.

చిన్న చిన్న వాటికి ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చోటు చేసుకున్నాయి. కొందరు మనుషులు అయితే మానవత్వాన్ని మరిచి పోయి మరి నడి రోడ్డుపై చంపుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి తల మొండెం వేరు చేసి మరీ పోలీసులకు లొంగిపోయాడు. అసలేం జరిగిందంటే.. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగ్లూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని దుండగులు చంపి అనంతరం అతడి తలను మొండెం వేరు చేశారు.

ప్రాథమిక సమాచారం మేరకు చనిపోయిన ఆ మృతుడు నల్గొండ జిల్లా వద్దిపట్ల వాసి నామ శ్రీనివాస్ గా గుర్తించడం జరిగింది. అయితే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని తానే చంపానని సరూర్ నగర్ పిఎస్ లో బ్రహ్మచారి అనే వ్యక్తి లొంగిపోయాడు. అయితే అతడు శ్రీనివాస్ ని ఎందుకు చంపాడు అన్నది మాత్రం వెల్లడించలేదు. పోలీసులు అతను చెప్పిన దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంలో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.