ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్క్.. రిలయన్స్ స్కెచ్ అదుర్స్ !

Forbes India Rich List 2020 Mukesh Ambani wealthiest

ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్కును ఏర్పాటు చేసే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులేస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో అంబానీ ఈ జూ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నారు. ‘గ్రీన్స్ జులాజికల్ రెస్క్యూ అండ్ ది రిహాబిలిటేషన్ కింగ్‌డమ్’ పేరిట సమర్పించిన డీపీఆర్‌కు సెంట్రల్ జూ అథారిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసింది.

Forbes India Rich List 2020 Mukesh Ambani wealthiest
 

జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీకి చేరువలో ఆ సంస్థకు ఉన్న 280 ఎకరాల స్థలంలో ఈ జూను ఏర్పాటు చేయబోతున్నారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కలల ప్రాజెక్ట్‌గా దీన్ని చెబుతున్నారు. రిలయన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా.. వన్య ప్రాణులకు ఆవాసం కల్పించడం కోసం గుజరాత్ అటవీ శాఖకు సహకరించడం కోసం కూడా ఈ ప్రాజెక్ట్ తోడ్పడనుంది. వచ్చే రెండేళ్లలో ఈ పార్కు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

రిలయన్స్ ఏర్పాటు చేయబోయే జూలో ప్రపంచం నలుమూలల నుంచి.. 100కిపైగా రకాల భిన్న జాతుల పక్షులు, సరీసృపాలు, జంతువులను తీసుకొచ్చి ఉంచనున్నారు. ఎలుగుబంట్లు, కొమోడో డ్రాగన్లు, తోడేళ్లు, పెలికాన్లు, అరిచే జింకలు.. తదితర జంతువులను ఈ జంతు ప్రదర్శనశాలలో ఉంచనున్నారు. చిరుతలు, జిరాఫీలు, ఏనుగులు, ఆఫ్రికా సింహాలు, నిప్పు కోడి తదితర వన్య ప్రాణులను ఈ జూలో ఉంచుతారు. ఇప్పటికే గుజరాత్‌లోని కెవాడియాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం ఉంది. త్వరలోనే ప్రపంచంకెల్లా అతిపెద్ద జూ సైతం ఈ రాష్ట్రంలోనే ఏర్పాటు కానుంది.